యోగా డే సందర్భంగా శనివారం 191 దేశాల్లో భారత్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. 1,300 సిటీల్లో 2000 ఈవెంట్స్కు ప్లాన్ చేసింది. యోగా డే 10వ వార్షికోత్సవం వేళ ప్రతి దేశంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. 15 దేశాలకు చెందిన 17 మంది యోగా గురువులు భారత్లో ఈవెంట్లను పర్యవేక్షిస్తారని వెల్లడించింది. పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లోనూ ఈవెంట్ ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) తెలిపింది.