గ్రేటర్ నోయిడాలోని బోడాకి రైల్వే క్రాసింగ్ వద్ద తుషార్ అనే యువకుడు బైక్పై వేగంగా వెళ్తూ రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ స్లిప్ అవ్వడంతో కిందపడిపోయాడు. అంతలోనే రైలు రావడంతో, కంగారులో పక్కకు తప్పుకోలేక ముందుకు కదిలాడు. దీంతో రైలు ఢీకొని మృతిచెందాడు. నెల రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.