సముద్రంలో కొట్టుకుపోయి యువకుడి గల్లంతు (వీడియో)

TG: సముద్రంలో కొట్టుకుపోయి ఓ యువకుడు గల్లంతయ్యాడు. మెదక్ జిల్లా రామాయంపేట ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న టంకరి రాము (34) ముంబై సముద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి బోటు ప్రయాణం చేసి ఒడ్డుకు చేరుకున్నాడు. బోటు దిగిన వెంటనే నీటి అలలు వేగంగా రావడంతో సముద్రంలోకి కొట్టుకుపోయాడు. యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొద్ది నిమిషాల ముందే కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన రాము గల్లంతవ్వడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్