మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కలియాసోట్ డ్యామ్ వద్ద ఈతకు వెళ్లి ఓ యువకుడు మరణించాడు. నగరంలోని కరోండ్ నివాసి వెంకటేష్ (32) మంగళవారం ఉదయం తన ఫ్రెండ్స్తో కలిసి కలియాసోట్ డ్యామ్కు వెళ్లాడు. అక్కడ ఇద్దరు ఈత కొడుతుండగా మరో యువకుడు మొబైల్లో వీడియో తీశాడు. అకస్మాత్తుగా వెంకటేష్ నీటిలో మునిగి చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.