దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వేరే వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానంతో ప్రియురాలు కనికాను యువకుడు అనురాగ్ హతమార్చాడు. మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి స్నేహితుల సహాయం కోరగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. కనికా రక్తపు మడుగులో కనిపించింది. అనురాగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కనికా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.