AP: విశాఖ గాజువాకలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలు మౌనికను కిరాతకంగా హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి ఒక భాగాన్ని ఫ్రిడ్జ్లో, మరొక భాగాన్ని గొనెసంచిలో దాచినట్లు తెలుస్తోంది. భార్య ఇంట్లో లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో పీఎస్ నుంచి రవీంద్రను ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు, మౌనికను ఎలా హత్య చేశాడన్న దానిపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు.