
కోహ్లీ సెంచరీ.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ ఇచ్చిన 242 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలోనే చేధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (100) అద్భుత సెంచరీ, శ్రేయాస్ అయ్యర్ (56) అర్థశతకంతో రాణించారు. గిల్ (46), రోహిత్ (20)లతో పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లో షాహిన్ అఫ్రిది 2 వికెట్లు.. ఖుల్దిష్ షా , అబ్రార్ తలా ఒక వికెట్ తీశారు.