సీకే గరల్స్ హైస్కూల్ కు సురక్షిత తాగునీటి ప్లాంట్
మంగళగిరి సీకే గరల్స్ హైస్కూల్ లోని విద్యార్థినుల కోసం రోటరీక్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో తాగునీటి ప్లాంట్ ను రూ. 2. 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. బుధవారం రోటరీ ఇంటర్నేనేషనల్ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ నామినీ ఉదయ్ పిలాని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్లాంట్ ను ప్రారంభించారు. మంగళగిరి రోటరీ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, సెక్రటరీ మురళీమోహన్, అనీల్ చక్రవర్తి, వడ్లమూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.