గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయిన ప్రధాని మోడీ.. కారణమిదే
ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. గుజరాత్ శకటాన్ని చూసి మురిసిపోయారు. ఆ శకటం వెళుతున్నంత సేపూ ప్రధాని దానినే చూస్తూ ఉండిపోయారు. ఈసారి గుజరాత్ శకటంలో ప్రధాని మోడీ జన్మస్థలమైన వాద్నగర్కు స్థానం కల్పించారు. ఈ శకటంలో గుజరాత్ అభివృద్ధితో పాటు అక్కడి సంస్కృతి, వారసత్వం కనిపిస్తుంది. అహ్మదాబాద్లోని సబర్మతి నదిపై నిర్మించిన అటల్ వంతెనకు గుజరాత్ శకటంలో చోటు కల్పించారు.