ఏపీ ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ మేనిఫెస్టో విడుదలకు మూహూర్తం ఖరారైంది. ఎల్లుండి వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో సీఎం ఇవాళ సమాలోచనలు చేశారు. మహిళలకు, రైతులకు సంబంధించి కీలక పథకాలను మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.