మీ ఓటు వేరే వాళ్లు వేస్తే ఏం చేయాలి?

62చూసినవారు
మీ ఓటు వేరే వాళ్లు వేస్తే ఏం చేయాలి?
మీ ఓటును వేరే వాళ్లు వేసినట్లు గుర్తిస్తే వెంటనే ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటర్ ఐడీ లేదా మరేదైనా గుర్తింపు పత్రం సమర్పించి అధికారి ఇచ్చే ఫామ్ 17(బి) పై పేరు రాసి, సంతకం చేయాలి. ఆ తర్వాత టెండర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపై మీ ఓటు వేయాలి. ఆ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49(పి) ప్రకారం పొందే ఈ ఓటును టెండర్/ఛాలెంజ్ ఓటు అంటారు. దీనిని ఈవీఎం ద్వారా వేయడం కుదరదు.

సంబంధిత పోస్ట్