రాజమండ్రి పార్లమెంటులో వన్ సైడ్ ఎన్నికలు జరగాలి
ఎన్డీఏ కూటమి కలిసిన తర్వాత రాజమండ్రి పార్లమెంటులో వన్ సైడ్ ఎన్నికలు జరగాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి మరియు ఎమ్మెల్యే అభ్యర్థికి భారీ మెజారిటీ రావాలని ఆయన సూచించారు. అలాగే రాబోయే 30 రోజులు మీరు కష్టపడండి తర్వాత మీ రుణం నేను తీర్చుకుంటానని అన్నారు.