Top 10 viral news 🔥
సీఎం జగన్కు వ్యతిరేకంగా బొటన వేలు నరుక్కున్న మహిళ (వీడియో)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, గుంటూరు రూరల్కు చెందిన కోపూరి లక్ష్మి అనే మహిళ జగన్ పాలనలోని అరాచకాలను దేశం దృష్టికి తీసుకొచ్చేందుకు ఏకంగా ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద తన బొటన వేలును నరుక్కుని నిరసన తెలిపింది. కళ్ల ముందు సమాజం నాశనమైపోతుంటే ఒక ఆదర్శ మహిళగా చూస్తూ ఊరుకోలేకపోతున్నానని, అందుకే ఇలా చేసుకున్నట్లు లక్ష్మి తెలిపారు.