నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
పెరవూరు మండలం మల్లేశ్వరం ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు తొలగించే నిమిత్తం శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సరఫరా నిలిపి వేయనున్నట్లు నిడదవోలు ఈఈ వీరభద్రరావు తెలిపారు. గురువారం రాత్రి ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లాకులవారిపాలెం, మల్లేశ్వరం, అన్నవరప్పాడు, పిట్టల వేమవరం, ఖండవల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.