రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టిన గోకవరం ఎస్సై

522చూసినవారు
రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టిన గోకవరం ఎస్సై
తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఎస్ఐ కె నాగరాజు రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్లో ఆపరేషన్ అవుతున్న పేషెంట్ కు అత్యవసరంగా రక్తం కావాలని కోరడంతో రక్తదానం చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఇప్పటికే 46 సార్లు రక్తదానం చేసిన ఆయన మంగళవారం రక్తం కావాలని ఫోన్ రావడంతో జక్కంపూడి బ్లడ్ బ్యాంక్ కు వెళ్లి రక్తదానం చేసినట్లు తెలిపారు. రక్తదానం చేసి మరొక ప్రాణాన్ని నిలబెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
Job Suitcase

Jobs near you