
స్నేహితుడి దుశ్చర్య.. కుటుంబమంతా కిడ్నాప్
AP: డీల్ ఉందని స్నేహితుడి కుటుంబాన్ని పిలిచి వారిని కిడ్నాప్ చేసిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. జీవకోనకు చెందిన రాజేశ్, తల్లి విజయలక్ష్మి, భార్య సుమతి, కుమార్తెలు యోషిత, జాష్మితతో కలిసి ఉంటున్నారు. అదే ప్రాంతానికి బాల్య స్నేహితుడు భార్గవ్కు రాజేశ్ రూ.24 లక్షలు అప్పు ఇచ్చాడు. డీల్ ఉందని రాజేశ్ కుటుంబాన్ని భార్గవ్ పిలిచి కొందరితో కలిసి కిడ్నాప్ చేశాడు. రూ.2 కోట్లు డబ్బు డిమాండ్ చేశాడు. రాజేశ్ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.