ఏపీ ఎలక్షన్స్.. బెంగళూరు, హైదరాబాద్ ఖాళీ..!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న తెలుగు వాళ్లు చలో ఏపీ అంటూ పయనం అయ్యారు. విదేశాల నుంచి కూడా చాలా మంది ఓటు వెయ్యడానికి ఏపీకి వచ్చారు. ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది ప్రజలు వాళ్లవాళ్ల సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ, బెంగళూరులో పని చేస్తున్న ఆంధ్ర ప్రజలు ఎన్నికల కోసం తమ సొంతూర్లకు వెళ్లడంతో మహానగరాలు సైతంగా ఖాళీగా కనిపిస్తున్నాయి.