బీసీవై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తమన్నా సింహాద్రి
గొల్లప్రోలు మండల చేబ్రోలులో బీసీవై పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిగ్ బాస్ తమన్నా సింహాద్రి గురువారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వారినని, బిసీవై పార్టీ అందరినీ కలుపుకుంటూ, అన్ని కులాల, మతాల వారికి సంబంధించిన పార్టీ అని తెలియజేశారు. తనను పిఠాపురం ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని తెలిపారు.