జనసేనలో చేరిన టీడీపీ కీలక నేతలు
By dwarak 249193చూసినవారుఅవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్, పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీలో చేశారు. పిఠాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో వీరిద్దరికి జనసేనాని పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా అవనిగడ్డ, పాలకొండ స్థానాలను జనసేనకు కేటాయించారు. దీంతో ఆ రెండు స్థానాల్లో వీరిద్దరే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగడం దాదాపు ఖాయమైంది.