సీఎం అయిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కరిస్తా
టీడీపీ అధికారంలోకి వచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కౌతాళంలోని తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆదివారం మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళంలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ఎద్దేవా చేశారు. అందులో ఏవైనా పథకాలు ఉన్నాయా తమ్ముళ్లు అంటూ అవహేళన చేశారు. యువత అందరూ సైకిల్ ఎక్కి టీడీపీ విజయానికి ప్రచారం చేయాలన్నారు.