కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక చేసిన అతిపెద్ద మంచి ప‌ని ఇదే..!

78చూసినవారు
కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక చేసిన అతిపెద్ద మంచి ప‌ని ఇదే..!
ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి దాదాపు నెల కావొస్తుంది. అయితే కూట‌మి ప్ర‌భుత్వం (టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ) ఏర్ప‌డిన త‌ర్వాత చెప్పుకోద‌గిన ప‌ని ఒక్క‌టీ చేయ‌లేద‌ని టాక్ వ‌చ్చింది. అయితే నేడు ప్ర‌భుత్వం పెన్ష‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. రూ. 1000 పెంచి గ‌త 3 నెల‌ల పెన్ష‌న్‌ను ప్ర‌భుత్వం ల‌బ్దిదారుల‌కు అంద‌జేసింది. దీంతో అర్హులైన ఫించ‌న్‌దారుల‌కు రూ. 7 వేలు ద‌క్కాయి. పైగా నెల రోజులు కూడా కాకుండానే ఈ విధంగా చేయడం అంటే గ్రేట్ అని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.