‘ఆన్‌లైన్’లో నీట్ ఎగ్జామ్? కేంద్రం యోచన

82చూసినవారు
‘ఆన్‌లైన్’లో నీట్ ఎగ్జామ్? కేంద్రం యోచన
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ‘నీట్-యూజీ’ పరీక్షను ఇకపై ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పరీక్షకు ముందే నీట్ ప్రశ్నపత్రం లీకవడంతో ఎగ్జామ్ రద్దుకు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్‌లైన్‌కు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘నీట్’ పెన్ను, పేపర్ పద్ధతిలో జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్