విశాఖలోని ఆనందపురం జంక్షన్లో మంగళవారం రెడ్బుక్ ఫ్లెక్సీ ఏర్పాటు చర్చనీయాంశమైంది. టీడీపీ కార్యకర్తలు దీనిని ఏర్పాటు చేశారు. టీడీపీ అగ్రనేత నారా లోకేష్ రెడ్బుక్ బాగాపాపులర్ అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు తమ కార్యకర్తలను ఇబ్బందిపెట్టారని, అలాగే తనపై చాలా కేసులు నమోదు చేశారని, అలా చేసివాళ్లందరీ పేర్లు రెడ్బుక్లో నమోదు చేశానని లోకేష్ పదేపదే చెబుతూ వచ్చారు.