టీడీపీ ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. కార‌ణ‌మిదే..?

83చూసినవారు
టీడీపీ ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. కార‌ణ‌మిదే..?
కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పింఛన్ల పంపిణీలో జరుగుతున్న సమయంలో టీడీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. పాత టీడీపీ నేతలు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతల మధ్య ఘర్షణ నెలకొంది. మంత్రాలయం జెడ్పీ పాఠ‌శాల‌లో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ విషయంలో టీడీపీలోని ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయని స‌మాచారం. టీడీపీ మండల అధ్యక్షుడు పన్నాగస్వామి వర్గీయులపై రాఘవేంద్ర రెడ్డి వర్గం దాడికి పాల్పడింది. ఈ ఘటనలో సురేష్, రాజు అనే వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.