
చరిత్ర మరిచిన స్వాతంత్య్ర యోధురాలు.. మాతంగిని హజ్రా
భారత స్వతంత్ర ఉద్యమ సమయంలో మరో వీరనారి కూడా తమ ప్రాణాలకు సైతం తెగించి భారత మాత ఒడిలో తనువు చాలించింది. చరిత్ర మరిచిన ఈ యోధురాలు పేరే మాతాంగిని హజ్రా. 72 సంవత్సాలర వయస్సులో మాతృభూమి స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారితో పోరాటం సాగించి.. వారి తూటాలకు బలై అమరవీరురాలు అయింది. ప్రజలంతా ఈమెను గాంధీ బురీ అని ముద్దుగా పిలుచుకుంటారు. పశ్చిమ బెంగాల్లోని మేథినీపుర్ జిల్లాలో హోగ్లా గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో హజ్రా జన్మించారు.