
ఏపీలోని పాక్ పౌరులు ఈ నెల 27లోగా దేశం విడిచి వెళ్లాలి: డీజీపీ
ఏపీలోని పాక్ పౌరులు ఏప్రిల్ 27లోగా దేశం విడిచి వెళ్లాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. 'ఇతర వీసాలపై దేశానికి వచ్చిన పాక్ పౌరులు ఈ నెల 27లోగా, మెడికల్ వీసాలపై వచ్చిన వారు ఈ నెల 29 లోగా దేశం వీడి వెళ్లాలి. పాక్ పౌరులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారి దేశానికి పంపేందుకు చర్యలు చేపడతాం. ఏపీలో అక్రమంగా ఉండే పాక్ పౌరులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం." అని డీజీపీ హెచ్చరించారు.