దేశంలో ప్రతి గంటకు ఒక రైతు ఆత్మహత్య

83చూసినవారు
దేశంలో ప్రతి గంటకు ఒక రైతు ఆత్మహత్య
దేశంలో ప్రతి గంటకూ ఒక రైతు, రైతు కూలీ ఆత్మహత్య చేసుకుంటున్నారని NCRB డేటా చెబుతోంది. డిసెంబర్ 4, 2023న విడుదల చేసిన తాజా డేటా ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 11,290 ఆత్మహత్యలు నమోదయ్యాయి. 10,281 మరణాలు నమోదైన 2021తో పోలిస్తే ఇది 3.7 శాతం పెరుగుదల. 2020 గణాంకాలతో పోలిస్తే ఇది 5.7 శాతం పెరుగుదల. టాప్ 5లో ఏపీ, తెలంగాణ ఉండటం విశేషం. తెలంగాణలో 2014 నుంచి 2021 వరకు 6,473 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2022లో ఏపీలో 917 మంది ఆత్మహత్య చేసుకున్నారు.