వైద్యంలో నిబంధనల మేరకు నైతిక విలువలు పాటించాలని ఎంబీబీఎస్ తుది సంవత్సరం విద్యార్థులకురాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్ ఎగ్గన్న సూచించారు. సోమవారం నుంచి హౌస్ సర్జన్లు (జూనియర్ వైద్యులు) గా విధులు నిర్వహించనున్న వారికి బాధితులకు వైద్య సేవలందించేప్పుడు పాటించాల్సిన నిబంధనలు, నిస్వార్ధ సేవలపై ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ఆయన అవగాహన కల్పించారు. డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ ఉన్నారు