శ్రీరాముడి దర్శనానికి అయోధ్య వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఈ విషయమై ఫిబ్రవరి 26న లేఖ రాసినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన సింధియా వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వివరించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు (మంగళ, గురు, శనివారం) అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.