హైదరాబాద్‌ To అయోధ్యకు డైరెక్ట్‌ విమానం

77చూసినవారు
హైదరాబాద్‌ To అయోధ్యకు డైరెక్ట్‌ విమానం
శ్రీరాముడి దర్శనానికి అయోధ్య వెళ్లే భక్తుల కోసం హైదరాబాద్‌ నుంచి డైరెక్ట్‌ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఈ విషయమై ఫిబ్రవరి 26న లేఖ రాసినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన సింధియా వాణిజ్య విమానయాన సంస్థలతో మాట్లాడినట్లు వివరించారు. ఏప్రిల్ 2 నుంచి వారానికి 3 రోజులు (మంగళ, గురు, శనివారం) అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.