లక్షెట్టిపేటలో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య

59చూసినవారు
లక్షెట్టిపేటలో ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
లక్షెట్టిపేట మండలంలోని హనుమంతుపల్లి గ్రామపంచాయతీ కి చెందిన జైనేని భీమక్క (35) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సతీష్ మంగళవారం తెలిపారు. తన భర్త రవితో కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు కలిసి మద్యం సేవిస్తూ తరచుగా గోడవ పడేవారు. ఈ క్రమంలో భర్తతో గొడవపడి ఆయనను కొట్టి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుంది. మృతురాలి సోదరుడు రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you