ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
మంగళవారం రాత్రి ఓ యువకుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్కు చెందిన మల్యాల నరేశ్ ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై పలు సందర్భాల్లో పంచాయతీలు కూడా అయ్యాయి. అయినా మళ్లీ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో యువతి సోదరుడు మంగళవారం రాత్రి నరేశ్ను ఆటోతో గుద్ది, బండతో మోదీ చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.