TG: హైదరాబాద్లోని అసిఫ్నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్పై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలించటానికి వచ్చిన ఫిరోజ్ఖాన్పై నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఫిరోజ్ఖాన్కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడే ఉన్న పోలీసులను ఇరు వర్గాలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.