గర్భిణిపై అత్యాచారం చేసి.. యాసిడ్ పోసి చంపేశాడు

72చూసినవారు
గర్భిణిపై అత్యాచారం చేసి.. యాసిడ్ పోసి చంపేశాడు
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో తాజాగా దారుణ ఘటన జరిగింది. అర్మాన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి సాకుతో ఓ యువతిని పలుమార్లు అత్యాచారం చేశాడు. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. దీంతో పెళ్లిచేసుకోమని ప్రియుడ్ని కోరగా.. అతను అబార్షన్ మాత్రలు వేసుకోమన్నాడు. దానికి యువతి నిరాకరించడంతో..ఆమెపై పై అత్యాచారం చేసి బలవంతంగా యాసిడ్‌ తాగించి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అర్మాన్ ను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్