మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు
మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు శనివారం ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పు చేయలేదని, యథావిధిగానే ఉదయం 6గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు నడుస్తాయన్నారు. ప్రతి శుక్రవారం రాత్రి 11. 45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5. 30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.