క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని మండల ప్రత్యేక అధికారి రత్నం అన్నారు. మంగళవారం నాగిరెడ్డిపేట్ మోడల్ స్కూల్ పాఠశాల మైదానంలో మండల స్థాయి సిఎం కప్ - 2024 టోర్నమెంట్ను ఎంపీడీవో ప్రభాకర్ చారితో కలిసి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్తో స్వాగతం పలికారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. వాలీబాల్ సర్వీస్ చేసి క్రీడలను ప్రారంభించారు.