గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేసీఆర్ ఫోకస్

81చూసినవారు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేసీఆర్ ఫోకస్
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై పడింది. ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడు జిల్లాల ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం భేటీ కానున్నారు. ఈ భేటీకి ఒక్కరూ కూడా మిస్ కావొద్దని కీలక నేతలకు సమాచారం ఇచ్చారు.