గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
జైనూర్ మండలంలోని జామ్నికి చెందిన జాదవ్ ప్రకాష్ గురువారం కెరమెరి మండలంలోని కేలి(బీ) సమీపంలోని కల్వర్టును దాటే క్రమంలో ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైన విషయం తెలిసిందే. శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా ఖైరి సమీపంలోని పెద్దవాగులో మృతదేహం లభించింది. మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృత్యుడి బంధువు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ తెలిపారు.