

తహవూర్ రాణాకు 18 రోజుల రిమాండ్
ముంబయి ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ హుస్సేన్ రాణాను 18 రోజుల NIA కస్టడీకి కోర్టు అనుమతించింది. గురువారం అర్ధరాత్రి ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపర్చారు. రాణాను 20 రోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని ఎన్ఐఏ కోరగా.. 18 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. కాగా దేశవ్యాప్తంగా అల్లర్లు, కుట్రలు జరగకుండా నిఘా పెట్టారు.