ఫిబ్రవరి 13, మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఈ-రిక్షా డ్రైవర్ కారును ఢీకొట్టినందుకు ఆ వ్యక్తిని కారు ఓనర్ దారుణంగా నడిరోడ్డులో అందరిముందు కొట్టాడు. ఆ వ్యక్తి ఇ-రిక్షా డ్రైవర్ను దుర్భాషలాడుతూ ఘోరంగా కొడతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్లో వైరల్ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కారు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.