ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్ఐ
కృష్ణ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు, పెండింగ్ చలాన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనచోదకులకు అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నవీద్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపేవారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవర్లు రోడ్డు మీద తమ వాహనాలను వ్యతిరేక దిశలో నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు.