మహిళను కట్టేసి దొంగతనం
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో మహిళను కట్టేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ఫిర్డోస్ కాలనీలో జరిగింది. కాలనీకి చెందిన గౌసియా బేగం ఇంట్లోకి సోమవారం ముగ్గురు దుండగులు చొరబడి ఆమెను కట్టేసి, అరవకుండా నోట్లో బట్ట పెట్టారు. అనంతరం బీరువాలోని ఆరు తులాల బంగారంతో పాటు రూ.50 వేలు చోరీ చేసినట్లు సీఐ కృష్ణా వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.