బోధన్ లో గురువారం జ్యోతిబాపూలే 198వ జయంతి వేడుకలను రాకాసిపేట గౌడ్స్ కాలనీలో నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విఠల్, మల్లికార్జున్, ప్రకాష్, ఎషాల గంగాధర్, ప్రసాద్, మాధవరావు, కృష్ణ, అంతేశ్వర్, విజయ్, రామా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.