పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రాళ్లగూడ సర్వీసు రహదారిలో బుధవారం 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మన పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుమన్రావు, హెల్త్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.