వాలంటీర్లకు మరో షాక్

67చూసినవారు
వాలంటీర్లకు మరో షాక్
AP: వాలంటీర్లకు మరో షాక్ తగిలింది. దినపత్రిక కొనుగోలు చేసేందుకు వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.200 చొప్పున చెల్లించేది. దీన్ని నిలిపివేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వాలంటీర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు దినపత్రిక కొనుగోలుకు నెలకు రూ.200 చొప్పున చెల్లించాలని గత ప్రభుత్వం 2022 జూన్ 29న జీవో జారీ చేసింది.

సంబంధిత పోస్ట్