జిల్లాలో పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ 8 నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నర్సింలు, రాజయ్య పాల్గొన్నారు.