విస్తృతంగా వాహనాల తనిఖీలు

71చూసినవారు
విస్తృతంగా వాహనాల తనిఖీలు
లోకసభ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లాలో కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు మంగళవారం విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ బి. అనురాధ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా రూ. 50వేల కంటే ఎక్కువ డబ్బులు తమ వెంట తీసుకెళ్లకూడదన్నారు. అత్యవసరంగా డబ్బులు తీసుకెళితే మాత్రం ఆధారాలు తప్పకుండా వెంట ఉండాలని సూచించారు. వాహనాల తనిఖీ నిర్వహించే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్