దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 33.21 పాయింట్లు లాభపడి 64,975.61 వద్ద, నిఫ్టీ 36.80 పాయింట్లు పెరిగి 19,443.50 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో బీపీసీఎల్,
అదానీ పోర్ట్స్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీల షేర్లు లాభపడగా, ICICI, NTPC, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.27 వద్ద ఫ్లాట్గా ముగిసింది.