అదానీ గ్రూపు కంపెనీల షేర్లు భారీగా పరుగులు తీశాయి.
అదానీ కంపెనీలపై ఆర్థిక ఆరోపణలపై విచారణలో సెబీ విశ్వసనీయతను ప్రశ్నించడానికి ఎటువంటి కారణం లేదని సుప్రీంకోర్టు చెప్పడంతో మంగళవారం
అదానీ కంపెనీల స్టాక్లు భారీగా పెరిగాయి. అందులోని 10 లిస్టెడ్ కంపెనీల స్టాక్స్ విలువ రూ.1.05 లక్షల కోట్లు పెరిగి రూ.11.31 లక్షల కోట్లకు చేరుకుంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఒక్కరోజులో ఈ స్థాయి లాభం రావడం ఇదే తొలిసారి.