జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి భక్తుడు వెండితో తయారుచేసిన 8 రకాల హారతులను బుధవారం ఉదయం స్వామివారి సన్నిధిలో సమర్పించినట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు తెలిపారు. ఆలయ అర్చకుడు దేవగిరి లక్ష్మన్న సూచనల మేరకు మిశ్రమ వెండితో తయారుచేసిన 8 హారతులను ఆలయానికి సమర్పించినట్లు వారు తెలిపారు.