నిన్న గొడవలు.. నేడు ఆసుపత్రికి క్యూలు

70చూసినవారు
ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో నిన్న పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రధాన పార్టీల వర్గాల మధ్య జరిగిన దాడులలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారంతా మంగళవారం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కట్టారు. దీంతో గాయపడిన వారితో ఆసుపత్రి నిండిపోయింది. గాయపడిన వారిని చూసేందుకు వస్తున్న బంధువులతో హాస్పిటల్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి.