రాష్ట్రానికి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా వెల్లడించారు.  విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని, వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్